Friday, September 7, 2018

జీవన్ముక్తుల జీవకారుణ్యం



అది 1983 ఏప్రియల్ చైత్ర పౌర్ణమి. పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని సరిహద్దు గ్రామమైన కొడంగల్ కు వచ్చారు. పర్ణశాలగా మార్చిన ఒక పశువుల కొట్టంలో వారి మకాం. మరుసటి రోజు నేను నా స్నేహితుడు విశ్వరూప దర్శనం చేసుకుని, స్వామివారి తెల్లవారు చేసే జపం అప్పుడు దాదాపు రెండు గంటల పాటు వారి వద్దనే కూర్చునే అదృష్టాన్ని పొందాము.

స్వామివారు జపం పూర్తిచేసేటప్పటికి దర్శనం కోసమని కొంతమంది భక్తులు వచ్చారు. మహాస్వామివారు వారితో మాట్లాడుతూ, తాము ఉంటున్న స్థలం యజమాని గురించి అడిగారు. ఆ సమూహం నుండి ఆ స్థలం యజమాని బంధువు ఒకరు ముందుకు వచ్చి, స్వామివారు అడిగిన విషయాలను తెలిపాడు. వారి కుటుంబం, వృత్తి, వారికున్న భూమి, గోసంపద మొదలైన విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఇది విన్నవారెవరికైనా వారిని గూర్చి మహాస్వామివారు అడిగి తెలుసుకుంటున్నారు అనే అనుకుంటారు. కాని అలా అడగడంలో ఆంతర్యం కేవలం తెలుసుకోవడం కోసం మాత్రమే కాదని తరువాత అర్థమయ్యింది. మరి ఇప్పుడు గోవుల్ని, గేదెలని ఎక్కడ ఉంచారు అని అడిగారు స్వామివారు. వాటిని ఆరుబయట కట్టేశారు అని తెలుసుకుని, ఈ ఎండలో రోజంతా అవి అక్కడే ఉంటాయా అని అడిగారు. వాటి నివాసాన్ని తను ఆక్రమించుకున్నానని స్వామివారి తలంపు కావచ్చు. వెంటనే మఠానికి సంబంధించిన కొన్ని వస్తువులను తీయించి, వాటిని లోపల ఉంచమని ఆదేశించారు.

ఆ మూగజీవులపై స్వామివారికున్న ప్రేమ అపారమైనది. ఆ పశువుల కొట్టంలో ఉండవలసిన హక్కు వాటిదే కాని తనది కాదని వాటికి చల్లని నీడను ఏర్పరిచారు మహాస్వామివారు.



Courtesy --- కంచి పెరివ ఫోరం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం